ప్రజాశక్తి-కూనవరం:కాంగ్రెస్, సిపిఐ, సిపిఐ(ఎంఎల్), మాస్లైన్ (ప్రజాపంథా), ఏజెన్సీ గిరిజన సంఘం, ఆదివాసీ సంఘాలు బలపరిచిన సిపిఎం అరకు ఎంపీ అభ్యర్థి పి.అప్పలనర్స, రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా రామారావుల విజయాన్ని కాంక్షిస్తూ గురువారం సాయంత్రం 4 గంటలకు అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండల కేంద్రంలోని పోలీస్ గ్రౌండ్ పక్కన భారీ బహిరంగ సభ జరుగనుంది. దీనికి ముఖ్య అతిథులుగా సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తదితరులు హాజరుకానున్నారు. తొలుత మధ్యాహ్నం 3 గంటలకు విఆర్.పురం మండలంలోని రేఖపల్లి నుంచి కూనవరం వరకూ బైకు ర్యాలీ, రోడ్ షో ఉంటాయి.