నండూరి సేవలు అజరామరం

Nov 30,2023 09:05 #CITU, #cpm leaders
cpm remember nanduri

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సిపిఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సిఐటియు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ నండూరి ప్రసాదరావు సమసమాజ స్థాపన కోసం, కార్మికవర్గ రాజ్యం కోసం సాగించిన సిద్ధాంత బాటలో ముందుకు వెళ్లడమే ఆ మహానీయునికిచ్చే నివాళి అని సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎవి నాగేశ్వరరావు, సిహెచ్‌ నరసింగరావు పేర్కొన్నారు. విజయవాడలోని సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఎవి నాగేశ్వరరావు అధ్యక్షతన నండూరి 22వ వర్థంతి సభ జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. కార్మికోద్యమానికి ఆయన చేసిన కృషిని వివరించారు. కార్మికోద్యమ నిర్మాతల్లో అగ్రగణ్యులని, చట్ట సభల్లో కార్మిక వాణిని వినిపించిన నేత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి అజయ్ కుమార్‌, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. అంతకముందు నండూరి చిత్రపటానికి సిహెచ్‌ నరసింగరావు పూలమాల వేసి నివాళులర్పించారు.

➡️