అరకలోయలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

  • మూడు బైకులు ఢీ 
  • దమ్మ గుడ్రి – గంజాయి గుడ మధ్యలో ఘటన

ప్రజాశక్తి-అరకులోయ : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని మాదల పంచాయతీ పరిధిలోకి వచ్చే దుమ్మ గుడ్రి – గంజాయి గుడ గ్రామాల మధ్యలో మూడు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో అక్కడికక్కడే  ఐదుగురు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మహాశివరాత్రి సందర్భంగా గంజాయి గుడ జాతరకు వెళ్తున్న సందర్భంలో నాలుగు బైకులు ఢీకొన్నాయి. ఒక బైక్ తరువాత మరో బైక్ ఢీకోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ సంఘటన లో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా , ఆస్పత్రిలో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. అలాగే మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️