గాలి జనార్థన్‌ రెడ్డి నుంచి ప్రాణహాని

– విశాఖ సిపికి సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఫిర్యాదు
ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో, ఎంవిపి.కాలనీ :కర్ణాటక బిజెపి నేత గాలి జనార్థన్‌రెడ్డి నుంచి తనకు ప్రాణ హాని ఉందని, ఈ నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలని కోరుతూ విశాఖ సిపి డాక్టర్‌ ఎ.రవిశంకర్‌ను సిబిఐ మాజీ జెడి, జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షులు వివి.లక్ష్మీనారాయణ కోరారు. ఈ మేరకు శుక్రవారం సిపి కార్యాలయానికి లక్ష్మీనారాయణ వెళ్లి వినతిపత్రం అందజేశారు. గతంలో జనార్థన్‌రెడ్డిని అక్రమ మైనింగ్‌ వ్యవహారాల కేసులో అరెస్టు చేసినందుకు విశాఖలో తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. 2011లో అక్రమ మైనింగ్‌ కేసులో బళ్లారిలో గాలి జనార్థన్‌రెడ్డిని తాను అరెస్టు చేసిన విషయాన్ని అందులో పొందుపరిచారు. విశాఖ ఉత్తరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జై భారత్‌ నేషనల్‌ పార్టీ తరపున తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, ప్రచారంలో పాల్గనే క్రమంలో తనపై కుట్ర జరిగే అవకాశాలున్నాయని సిపికి వివరించారు.

➡️