TSRTCకి మరో 80 కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌

తెలంగాణ : తెలంగాణ ఆర్టీసీకి మరో 80 కొత్త ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బిఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ఈ కొత్త 80 ఆర్టీసీ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ సజ్జనార్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 30 ఎక్స్‌ప్రెస్‌, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్‌ అండ్‌ సీటర్‌ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణకు పెద్దపీట వేయాలని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పారని ఈ సందర్భంగా మంత్రి పొన్నం తెలిపారు. సీసీఎస్‌ బకాయిలు త్వరగా విడుదల చేస్తామని వెల్లడించారు. త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్‌ బస్సులు ఆర్టీసీకి అందుబాటులోకి రాబోతున్నన్నట్లు ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. వీటిలో హైదరాబాద్‌కు 500, జిల్లాలకు 500 బస్సులు కేటాయించనున్నట్లు వివరించారు.

➡️