ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నాని (ఈలి వెంకట మధుసూదనరావు) వైసిపిలో చేరారు. గురువారం తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసిపి కండువా కప్పుకున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈలి నాని.. గత ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ కార్యక్రమంలో వైసిపి రీజనల్ కో-ఆర్డినేటర్ పివి మిథున్రెడ్డి పాల్గొన్నారు.