రోడ్డు ప్రమాదంలో రాయపాటి అరుణకు గాయాలు

May 2,2024 11:29 #bapatla, #road accident

బాపట్ల: జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణకి రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. ఆమె ప్రయాణిస్తున్న కారు బాపట్ల జిల్లా రేణంగివరం వద్ద డివైడర్‌ని ఢ కొట్టింది. ఈ ప్రమాదంలో అరుణతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. చికిత్స కోసం అరుణను ఒంగోలు కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లాకు చెందిన రాయపాటి అరుణను జనసేన అధికార ప్రతినిధిగా రెండేళ్ల క్రితం నియమించారు. అప్పటి నుంచి ఆమె పార్టీలో చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ విధానాలను జనాల్లోకి తీసుకెల్లడం నుంచి విమర్శలను ధీటుగా ఎదుర్కోవడం… సమస్యలపై స్పందించడం వంటివి చేస్తున్నారు.

➡️