ఎన్నికల కమిషన్‌ అనుమతి తర్వాతే టెట్‌ ఫలితాలు : విద్యాశాఖ

Mar 21,2024 16:49 #2024 elections, #ap tet, #Exams

ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే టెట్‌ ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొంటూ అధికారిక వెబ్‌సైట్‌ https://aptet.apcfss.in/లో విద్యాశాఖ ప్రకటన చేసింది. షెడ్యూల్‌ ప్రకారమైతే మార్చి 14వ తేదీనే టెట్‌ ఫలితాలు వెల్లడి కావాల్సిఉంది. అయితే, అధికారులు ఆ షెడ్యూల్‌ ప్రకారం విడుదల చేయలేదు. ఈలోపు మార్చి 16న ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఇప్పుడు ఈసీ నుంచి అనుమతి రాగానే ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

➡️