సీపీఎం కుటుంబంపై వైసిపికి చెందిన వ్యక్తి దాడి

ycp activist attack on cpm family

ప్రజాశక్తి-నెల్లూరు : సిపిఎం నెల్లూరు రూరల్ మండల కమిటీ సభ్యుడు సుధీర్ ఇంటిపై, సుధీర్ ఇంట్లో లేని సమయంలో వైసిపి పార్టీకి చెందిన కాకి రాంబాబు ఇంట్లోకి ప్రవేశించి సుధీర్  అక్క, అమ్మలపై దాడికి పాల్పడ్డారు. ఇంట్లో వారిపై రాడ్లతో దాడి చేసిన కాకి రాంబాబు గతంలో ఇతర గ్రామస్తులతోనూ అకారణంగా గొడవలు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ‘వైసిపిలో ఉన్నాను, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అంటూ’ మాట్లాడుతూ దాడికి పాల్పడ్డారు. దాడికి గురైన సుధీర్ సోదరి నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఉన్నారు. సుధీర్ నెల్లూరులో న్యాయవాదిగా ఉంటూ, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా ఉండే వ్యక్తి. సిపిఎం నెల్లూరు రూరల్ మండల కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ప్రజా సమస్యల పట్ల, ఎప్పుడూ అగ్రభాగాన ఉండటంతో ఉండే సుధీర్ కుటుంబం సీపీఎం పార్టీకి చెందింది. సుధీర్ న్యాయవాదిగా నెల్లూరు కోర్టులో ప్రాక్టీస్ లో ఉన్నారు.

➡️