రాజస్థాన్ : గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందిన ఘటన రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ శివారులో జరిగింది. పోలీసుల కథనం మేరకు … జస్లా గ్రామంలో ఓ మహిళ వంట గదిలో వంట చేస్తుండగా గ్యాస్ లీకై పేలింది. ఇంటికి మంటలు అంటుకోవడంతో ఐదుగురు కుటుంబ సభ్యులు సజీవదహనమయ్యారు. వెంటనే గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. మఅతులలో ముగ్గురు మైనర్లు ఉన్నారని స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజేంద్ర శర్మ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.