సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన వృద్ధుడి మృతదేహం

ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : సముద్రపు ఒడ్డుకు వృద్ధుని మృతదేహం కొట్టుకొచ్చిన ఘటన బుధవారం ఓడరేవు గ్రామం సమీపంలోని దత్తాత్రేయ రొయ్యల ఫ్యాక్టరీ సమీపంలో జరిగింది. సుమారు 65 సంవత్సరాల వయస్సున్న వృద్ధుని మృతదేహం సముద్రంలో నుండి బయటకు కొట్టుకొచ్చింది. సుమారు రెండు రోజుల క్రితం సముద్రంలో మునిగినట్లుగా తెలుస్తుంది. ఆత్మహత్య అయి ఉండవచ్చునని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మృతదేహం కుడి కన్ను మీద రక్తపు గాయాలున్నాయి. బహుశా చేపలు పీకినట్లుగా ఉన్నదని భావిస్తున్నారు. మృతుడి శరీరం మీద బ్లూ కలర్‌ షర్ట్‌, బ్లాక్‌ కలర్‌ ప్యాంట్‌, బ్లాక్‌ కలర్‌ స్పోర్ట్స్‌ షూ ఉన్నాయి. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️