ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) : అల్పపీడన ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామంలో బుధవారం మధ్యాహ్నం ఆకాశం ఒక్క సారిగా మేఘాకృతమై సిరిజల్లు కురిసాయి. గత వారం రోజులుగా మండలంలో రాత్రిపూట చలిగాలులు, మధ్యాహ్నం పూట ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరితో ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేసింది. ఈ నేపద్యంలో బుధవారం మండలంలో వాతావరణం మేఘాలు మబ్బులతో నిండి ఉండడంతో మధ్యాహ్నం చిరుజల్లు కురవడంతో వాతావరణం చల్లబడింది.