న్యూఢిల్లీ : బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ నేతలను స్వేచ్ఛగా వదిలేస్తూ.. ప్రతిపక్ష నేతలను ఎన్నికల అధికారులు లక్ష్యంగా చేసుకున్నారని కాంగ్రెస్ ఆదివారం మండిపడింది. బీహార్లోని సమస్తిపూర్లో కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే హెలికాప్టర్ను అధికారులు తనిఖీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం ఖర్గే ముజఫర్పూర్, సమస్తిపూర్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే.
కేరళలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ హెలికాప్టర్ను తనిఖీ చేశారని, ఇప్పుడు ఖర్గే హెలికాప్టర్ను తనిఖీ చేశారని కాంగ్రెస్ నేత రాజేష్ రాథోర్ ఎక్స్లో పేర్కొన్నారు. ఖర్గే హెలికాప్టర్ తనిఖీని బీహార్ ఎన్నికల అధికారి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు.
కాంగ్రెస్ నేతల హెలికాప్టర్లు తనిఖీ చేయడం సాధారణమేనా, ఎన్డిఎ అగ్ర నేతలపై కూడా ఇలాంటి తనిఖీలు జరిగాయా అని ఎన్నికల కమిషన్ (ఇసి) వెల్లడించాలని రాథోర్ పేర్కొన్నారు. తనిఖీ చేసిన నేతలందరి వీడియోలను ఇసి బయటపెట్టాని అన్నారు.
श्री @RahulGandhi जी के बाद अब @INCIndia अध्यक्ष श्री @kharge जी का हेलीकॉप्टर की तलाशी बिहार के समस्तीपुर में सभा के दौरान चुनाव आयोग और पुलिसकर्मियों द्वारा करना चुनाव आयोग का दुर्भावना पूर्ण व्यवहार प्रतिपक्षों के लिए दर्शाता है यह लोकतंत्र की हत्या है l pic.twitter.com/tk1SUqcj5P
— Rajesh Rathorre (@RajeshRathorre1) May 11, 2024