బెంగళూరు : లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ సందర్భంగా కర్ణాటకలో మంగళవారం ఒకే కుటుంబానికి చెందిన 96 మంది కలిసి వచ్చి ఓటేశారు. హబ్బళి-ధార్వాడ్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో నూల్వి గ్రామానికి చెందిన కంటెప్ప తోతాడ కుటుంబం ఒకేసారి పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ కేంద్రం వద్ద సెల్ఫీలు, ఫొటోలు దిగి సందడి చేశారు. మూడు తరాలకు చెందిన ఆ కుటుంబ ఓటర్లు ప్రతి ఎన్నికలోనూ ఇలాగే ఓటు వేస్తుంటారు. కాగా అసోంలోని దిబ్రూఘాట్కు చెందిన ఓటర్లు పడవల్లో వచ్చి ఓటేశారు.