చెన్నై విలవిల : ఏడుగురు మృతి

Dec 6,2023 09:57 #chennai, #dead, #Rain effect, #Seven
  • రూ. 5 వేల కోట్ల సాయానికి తమిళనాడు విజ్ఞప్తి

చెన్నై : మిచౌంగ్‌ తుపానుతో చెన్పై అతలాకుతలమైంది. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు చెన్పై నగరం తడిసి ముద్దయింది. వర్షాలు సృష్టించిన బీభత్సానికి కేవలం చెన్నైలో ఏడుగురు చనిపోయారు. మంగళవారానికి వర్షాలు కాస్త శాంతించినా నగరంలో అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లోనూ తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. మరో వైపు మరమ్మత్తులు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ 5 వేల కోట్ల మధ్యంతర సహాయాన్ని కోరతామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా కురిసిన వర్షాలతో నివాస ప్రాంతాలు, రోడ్లు దెబ్బతిన్నాయని వీటికి మరమ్మతులు అవసరం అని స్టాలిన్‌ తెలిపారు.

➡️