పాముకాటుతో రైతు సంఘం నాయకుడు మృతి

Apr 6,2024 23:51 #Deaths, #Guntur District, #Snake

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్‌ (పల్నాడు జిల్లా) :పాముకాటుకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండల రైతు సంఘం అధ్యక్షులు బగ్గి వెంకటేశ్వర్లు (65) శనివారం మృతి చెందారు. మండలంలోని కందులువారిపాలేనికి చెందిన ఆయన వేసవి నేపథ్యంలో తన ఇంటిపై వేసుకోవడానికి జమ్ము కోసం ఊరికి సమీపంలోని మడులకు మరొకరిని తోడు తీసుకుని వెళ్లారు. జమ్ము కోస్తుండగా ఏదో కుట్టినట్లు అనిపించడంతో చూడగా పాము కనిపించింది. దీంతో, వెంకటేశ్వర్లు పక్కనున్న వ్యక్తి వెంటనే కుటుంబీకులకు ఫోన్‌ ద్వారా సమాచారమిచ్చారు. వారొచ్చి సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే వెంకటేశ్వర్లు మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అంత్యక్రియలు ఆదివారం ఉదయం కందులవారిపాలెంలో నిర్వహిస్తామని, అనంతరం సంతాప సభ ఉంటుందని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.లకీëశ్వరరెడ్డి తెలిపారు. వెంకటేశ్వర్లు భౌతికకాయానికి సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు నివాళులర్పించారు.

➡️