ప్రజాశక్తి-అమరావతి : నేటి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత తొలిసారి జనంలోకి జగన్ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు.. అలాగే. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి జిల్లా వెంకటగిరిలో సభలో.. మధ్యాహ్నం 3 గంటలకు కందుకూరులో సభకు హాజరుకానున్నారు. అనంతరం తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు.