అమరావతి : అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సిఆర్డిఎ గెజిట్ జారీ చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం … అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నిర్మించనున్నారు. ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతమైన 1575 ఎకరాల ప్రాంతాన్ని సిఆర్డిఎ నోటిఫై చేసింది. మాస్టర్ ప్లాన్లో భాగంగా … జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని సిఆర్డిఎ నోటిఫై చేసింది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/amaravati-2.jpg)