గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదానం ప్రారంభం

Feb 29,2024 12:18 #Tirupati, #ttd, #TTD EO
Nityannadanam at Govindarajaswamy Temple

ప్రారంభించిన భూమన, ధర్మారెడ్డి

ప్రజాశక్తి-తిరుపతి : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదానంను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డిలు  ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ ఈ ఆలయంలో నిత్యాన్నదానంను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందన్నారు.  అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తామని తెలిపారు. ఈ రోజు నుంచి ప్రతి రోజు రెండు వేల మంది భక్తులకు సరిపడేలా శ్రీగోవింద రాజస్వామి ఆలయం వద్ద నిత్యాన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తిరుమలలో రోజూ లక్ష మంది నిత్యాన్నదాన పథకం ద్వారా భోజనం చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలోతాను టీటీడీ పాలక మండలి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు తిరుమల వచ్చిన ప్రతి భక్తుడూ అన్నదానంలో భోజనం తినే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదే సమయంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద కూడా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామని వెల్లడించారు. తర్వాత ఒంటిమిట్టలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.

➡️