BJP MP డీకే అరుణ ఇంటిని ముట్టడించిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

Jun 29,2024 12:56 #BJP MP, #Dharna, #mp dk aruna, #neet exam, #SFI

హైదరాబాద్‌ : నీట్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించి.. పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ, పలు విద్యార్థి సంఘాల నాయకులు బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంటిని ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని, నీట్‌ ఎగ్జామ్‌ మళ్లీ పెట్టాలని, ఎన్‌టిఏను రద్దు చేయాలని నినాదాలు చేశారు. నీట్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు పలువురు ఎస్‌ఎఫ్‌ఐ, విద్యార్థి సంఘాల నాయకులకు లారీలో ఎక్కించుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

➡️