ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రాజేంద్రనాధ్ మంగళవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో పర్యటించారు. మున్సిపల్ అతిధి గృహంలో బసచేసి, మండలంలోని పెదమైనవానిలంక గ్రామంలో డిజిటల్ భవనాన్ని పరిశీలించారు. పిఎం విశ్వకర్మ లో శిక్షణ పొందినవారికి సర్టిఫికెట్ ప్రదానం చేయనున్నారు. రాష్ట్ర చీఫ్ విప్, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మంత్రికి పుష్పగుచ్ఛాన్ని అందచేసి స్వాగతం పలికారు.