ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మంగళగిరిలోని సికె కన్వెన్షన్ హాల్లో వైసిపి మంగళవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘మేము సిద్ధం-మా బూత్ సిద్ధం’ సభతో పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో ఎన్నికలకు సమాయత్తం అయ్యేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్ధేశం చేయనున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం సజ్జలతో కలిసి శాసనమండలి ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సజ్జల మాట్లాడుతూ.. ఈ సభలకు నియోజకవర్గ, పట్టణ స్థాయి, మండల, బూత్స్థాయి నాయకులను కలిపి దాదాపు 2,700 మంది హాజరవుతారని అన్నారు. టిడిపి, జనసేన సర్దుబాట్లు అతుకులబొంత తరహాలో తయారైందని విమర్శించారు. వారితోపాటు మంగళగిరి పార్టీ ఇన్ఛార్జి గంజి చిరంజీవి, నాయకులు నారాయణ మూర్తి, చల్లా మధు తదితరులు ఉన్నారు.