ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తాం: మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌ : ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి గురువారం తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ధరణికి సంబంధించి తన వద్ద మరింత సమాచారం ఉందన్నారు. రిజిస్ట్రేషన్‌ శాఖను ప్రక్షాళన చేస్తామని.. వేసవి కాలంలో ప్రజలకు ఎలాంటి తాగునీటి సమస్యలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎవరి ఫోన్లను ట్యాపింగ్‌ చేయడం లేదని స్పష్టం చేశారు.

➡️