ఏఐసీసీ నేతలకు ట్రాఫిక్ కష్టాలు

traffic in cm oath ceremony

తెలంగాణ : మరికొద్ది సేపట్లో తెలంగాణ సిఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఏఐసీసీ నేతలు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కాన్వాయ్ రవీంద్ర భారతి దగ్గర ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. ఆయనతో పాటు వస్తున్న డిప్యూటీగా ప్రమాణ స్వీకారం చేయనున్న భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. దీంతో వీరు కారు దిగి నడుచుకుంటూ సభా వేదికకు వెళ్లారు. కాంగ్రెస్ అగ్ర నేతలు ఇప్పటికే సభకు చేరుకున్నారు. మరో వైపు అసెంబ్లీ సమీపంలోని అమరవీరుల స్థూపం దగ్గర ట్రాఫిక్ లో చిక్కుకున్న కాంగ్రెస్ నేతలు కూడా కారు దిగి నడుచుకుంటూ వెళ్తున్న నడుచుకుంటూ వెళ్తున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళసై ఎల్బీ స్టేడియంకి చేరుకోనున్నారు.

➡️