10 రోజుల్లో వస్తాం.. రూ.15వేల రైతు భరోసానిస్తాం : రేవంత్‌ రెడ్డి

తెలంగాణ : తెలంగాణలో ‘రైతు బంధు’ సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకోవడంపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. సోమవారం మీడియాతో రేవంత్‌ మాట్లాడుతూ … రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత మాత్రమే బిఆర్‌ఎస్‌ నేతలకు ఉందని విమర్శించారు. మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యల వల్ల రైతుబంధుకు ఈసీ అనుమతి రద్దు చేసిందని.. ఆ వ్యాఖ్యలే కారణమని ఈసీ చెప్పిందని ఆరోపించారు. హరీశ్‌రావు నియమావళిని ఉల్లంఘించారని ఈసీ పేర్కొందని అన్నారు. నిజంగా రైతులకు మేలు చేసే ఉద్దేశం సిఎం కెసిఆర్‌, హరీశ్‌కు లేదని చెప్పారు. రాష్ట్రంలో రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దు అని అన్నారు. 10 రోజుల్లో కాంగ్రెస్‌ రాగానే రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.

➡️