న్యూయార్క్ : అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో నౌక ఢీకొట్టడంతో బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో గల్లంతైన ఆరుగురూ మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వారి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపును అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం వరకు నిలిపివేస్తున్నామని ప్రకటించారు. ఘటన సమయంలో వారంతా బ్రిడ్జి పై గుంతలు పూడుస్తున్నారని మేరీలాండ్ రవాణాశాఖ కార్యదర్శి పాల్ వైడెఫెల్డ్ తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో నది లోతును బట్టి, నదిలో పడిన వారంతా కనిపించకుండాపోయిన తర్వాత గడిచిన సమయాన్ని బట్టి చూస్తే వారు ఇప్పటికి మరణించి ఉంటారని వారిని పనిలో నియమించుకున్న కంపెనీ బ్రానర్ బిల్డర్స్ పేర్కొంది. దీంతో ఈరోజు ఉదయంతో వారికోసం గాలింపు చర్యలు ఆపేశారు.
మరింత సమాచారం మేరకు …
America: నదిపై కూలిన వంతెన : నదిలో చిక్కుకున్న 20 మంది వాహనదారులు