రోడ్డు, డ్రైనేజి పనులకు భూమి పూజ ప్రజాశక్తి – పుత్తూరు టౌన్ : స్థానిక మున్సిపాలిటీ 16వ వార్డు లోని 15వ ఆర్థిక సంఘం నిధులు ద్వారా సబ్ రిజిస్ట్రారు కార్యాలయం, జ్ఞాన జ్యోతి స్కూల్ సమీపం లో రూ.8.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు అభివద్ధి పనులను రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక వ్యవహారాల, యువజన సర్వీసుల, క్రీడా శాఖ మంత్రి ఆర్ కెరోజా మంగళవారం భూమి పూజ చేశారు. పుత్తూరు మున్సిపాల్టీ వైసిపి నాయకులు, ప్రజాప్రతినిధులు మంత్రికి ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు మున్సిపాల్టీ ఛైర్మన్ ఎ హరి, వైస్ ఛైర్మన్లు, డి జయప్రకాష్, కౌన్సిలర్లు వనిత కార్తీక్, భానుమతి, మున్సిపల్ కమిషనర్ కేఎల్ రెడ్డి, అధికారులు, ఆలయ ఛైర్మన్ కే రమేష్, మనోహర్ రెడ్డి, స్టేట్ డైరెక్టర్లు, బోర్డు డైరెక్టర్లు మున్సిపల్ సిబ్బందిలో కన్వీనర్ పార్టీ కన్వీనర్ వైసిపి కార్యకర్తలు, నాయకులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
రోడ్డు, డ్రైనేజి పనులకు భూమి పూజ ప్రజాశక్తి – పుత్తూరు టౌన్ : స్థానిక మున్సిపాలిటీ 16వ వార్డు లోని 15వ ఆర్థిక సంఘం నిధులు ద్వారా…